ఏ తల్లికీ ఈ కష్టం రాకూడదు: ఏడ్చేసిన శ్రీశాంత్ తల్లి
తమ కుమారుడు ఈ విధమైన తప్పు చేస్తాడని అనుకోవడం లేదని, మైదానంలో అతిగా ప్రవర్తించి ఉండవచ్చునని, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, తాము ఎవరినీ నిందించదలుచుకోలేదని శ్రీశాంత్ తల్లి సావిత్రీదేవి అంటూ కంటతడి పెట్టుకున్నారు. తన తల్లికీ తనకు వచ్చిన కష్టం రాకూడదని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు.
తన కుమారుడి కెరీర్ను నాశనం చేయడానికి ఏదైనా పెద్ద శక్తి పని చేసి ఉండవచ్చునని శ్రీశాంత్ తండ్రి శాంతకుమారన్ నాయర్ అన్నారు. నిన్న ఏం జరిగిందో చూడండి, బెయిల్ పొందడానికి అన్నీ పూర్తయ్యాయని, అకస్మాత్తుగా ఢిల్లీ పోలీసులు కొత్త సెక్షన్లతో ముందుకు వచ్చారని ఆయన అన్నారు. ప్రతిదీ మిస్టరీగానే కనిపిస్తోందని ఆయన అన్నారు.
శ్రీశాంత్పై ఢిల్లీ పోలీసులు మోకాను ప్రయోగించిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపియల్ ఆడిన శ్రీశాంత్ను స్పాట్ ఫిక్సింగ్ కేసులో పోలీసులు గత నెల 16వ తేదీన అరెస్టు చేశారు. శ్రీశాంత్కు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది.