టిడిపి వైఖరి చూస్తుంటే గుండె మండుతోంది: యెన్నం
పోలీసులను ముఖ్యమంత్రి నియంత్రించక పోవడం దురదృష్టకరమని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ వేరుగా అన్నారు. తాము చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. లేదంటే ఏం జరిగినా ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు అందరు ఇందిరా పార్కు వద్దకు రావాలని కోదండరామ్ పిలుపునిచ్చారు.
పోలీసులు అరెస్టు చేసిన పక్షంలో అడ్డుకున్న చోటునే నిరసనకు దిగాలన్నారు. మంత్రులు చలో అసెంబ్లీకి అనుమతిని ఇప్పించాలన్నారు. తమను అసెంబ్లీకి రానివ్వకుంటే మంత్రులను గ్రామాలకు రానిచ్చే ప్రసక్తి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వారిని గ్రామాలకు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణకు అనుకూలమని చెబుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టులపై ఎందుకు స్పందించడం లేదన్నారు.
శుక్రవారం ఇందిరా పార్కు నుండి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్తామన్నారు. తెలంగాణవ్యాప్తంగా అక్రమ అరెస్టులు దారుణమన్నారు. శాంతియుతంగానే ఆందోళన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆరువేలకు పైబడి బైండోవర్ కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అసాంఘిక శక్తులను ప్రభుత్వం సృష్టించి భయాందోళనకు గురి చేస్తోందన్నారు. పోలీసుల నియంతృత్వాన్ని తాము ఖండిస్తున్నామన్నారు.