వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయల్ యువతితో శ్రీశాంత్ పెళ్లి, స్వామివారి దర్శనం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sreesanth
కొచ్చి: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టై నాలుగు రోజుల క్రితం బెయిల్ పైన విడుదలైన కేరళ పేసర్ శ్రీశాంత్ ఈ వారాంతంలో అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోనున్నారట. కేరళలోని శబరిమలలో అయ్యప్ప స్వామి కొలువై ఉన్నాడు. ఫిక్సింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీశాంత్ తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్న విషయం తెలిసిందే.

రెండు రోజుల క్రితం శ్రీశాంత్ ఇంటికి చేరుకున్నాడు. అంతకుముందే శ్రీశాంత్ వివాహంపై ప్రచారం జరిగింది. ఇప్పుడు విడుదల తర్వాత మరోసారి పెళ్లి అంశం ప్రస్తావనకు వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ తన సోదరుడు దీపుతో కలిసి అయ్యప్ప స్వామి వారిని దర్సించుకోనున్నారట.

కేసు నుండి బయటపడేయాలని శ్రీశాంత్ కోరుకోవడంతో పాటు వివాహం కోసం కూడా స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాలనుకుంటున్నారట. వచ్చే సెప్టెంబరులో కేరళవాసులు ఓనమ్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో శ్రీశాంత్ పెళ్లి ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు.

శ్రీశాంత్ వివాహం జైపూర్‌కు చెందిన ఓ రాయల్ కుటుంబానికి చెందిన యువతితో జరగనుందనే ప్రచారం సాగుతోంది. కేరళలోని గురువాయూర్‌లో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. యువతి ఎవరనే విషయాన్ని శ్రీ కుటుంబ సభ్యులు చెప్పనప్పటికీ కేరళేతర యువతితో పెళ్లి ప్రపోజల్ వచ్చిందని చెబుతున్నారు.

యువతిని తమ కుటుంబ సభ్యులు చూడలేదని, తాము వారి నుండి ప్రపోజల్ వచ్చిందని శ్రీశాంత్ సోదరి విదిత చెప్పారు. కాగా శ్రీశాంత్ సోదరి భర్త మధు బాలకృష్ణ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్.

English summary

 As pacer S. Sreesanth is set to pray before Lord Ayyappa this weekend with his brother Deepu, it may also be seeking blessings for tying the nuptial knot, which may happen sometime during Onam season in September.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X