రాయల్ యువతితో శ్రీశాంత్ పెళ్లి, స్వామివారి దర్శనం?
రెండు రోజుల క్రితం శ్రీశాంత్ ఇంటికి చేరుకున్నాడు. అంతకుముందే శ్రీశాంత్ వివాహంపై ప్రచారం జరిగింది. ఇప్పుడు విడుదల తర్వాత మరోసారి పెళ్లి అంశం ప్రస్తావనకు వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ తన సోదరుడు దీపుతో కలిసి అయ్యప్ప స్వామి వారిని దర్సించుకోనున్నారట.
కేసు నుండి బయటపడేయాలని శ్రీశాంత్ కోరుకోవడంతో పాటు వివాహం కోసం కూడా స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాలనుకుంటున్నారట. వచ్చే సెప్టెంబరులో కేరళవాసులు ఓనమ్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో శ్రీశాంత్ పెళ్లి ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు.
శ్రీశాంత్ వివాహం జైపూర్కు చెందిన ఓ రాయల్ కుటుంబానికి చెందిన యువతితో జరగనుందనే ప్రచారం సాగుతోంది. కేరళలోని గురువాయూర్లో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. యువతి ఎవరనే విషయాన్ని శ్రీ కుటుంబ సభ్యులు చెప్పనప్పటికీ కేరళేతర యువతితో పెళ్లి ప్రపోజల్ వచ్చిందని చెబుతున్నారు.
యువతిని తమ కుటుంబ సభ్యులు చూడలేదని, తాము వారి నుండి ప్రపోజల్ వచ్చిందని శ్రీశాంత్ సోదరి విదిత చెప్పారు. కాగా శ్రీశాంత్ సోదరి భర్త మధు బాలకృష్ణ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్.