వరదల్లో తెలుగువారు, భజ్జీ కూడా: రక్షించాలని ట్వీట్
ఓ వైపు వర్షాలు తగ్గక వరద ఉధృతి పెరుగుతుండటంతో వారిని కాపాడేందుకు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగువారు అందరూ క్షేమంగానే ఉన్నారు. తెలుగువారి కోసం సహాయక చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణతో ఫోన్లో మాట్లాడారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కూడా అధికారులను ఆదేశించారు.
వారి క్షేమ సమాచారాలందక వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక అధికారులు సహాయ చర్యలు చేపడదామన్నా.. వాన ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో ఏమీ చేయలేక చేతులెత్తేశారు. బుధవారం దాకా పరిస్థితి ఇంతేనని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం తెలిసి యాత్రికులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితి చూసి యాత్రికులు భయపడాల్సిన పని లేదని, రెండు రోజుల్లో పరిస్థితి చక్కబడి అంతా క్షేమంగా స్వస్థలాలకు చేరుకుంటారని చెబుతున్నారు.
వరదల్లో చిక్కుకుపోయిన భజ్జీ
ఉత్తరాఖండ్ వరదల్లో ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా చిక్కుకుపోయాడు. తాను క్షేమంగానే ఉన్నానంటు అతని ట్వీట్ చేశాడు. హర్భజన్ ఉత్తరాఖండ్లోని గురుద్వారకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వరదల్లో చిక్కుకుపోయాడు. ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీసుల శిబిరంలో తలదాచుకున్నాడు. తాను బాబాజీ దయ వల్ల క్షేమంగానే ఉన్నానని, ఇక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయని, చాలామంది ప్రజలు ఇక్కడ చిక్కుకుపోయారని, వారిని ప్రభుత్వం రక్షించాలని ఆయన ట్వీట్ చేశాడు.