వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్, చిరు వర్గం మంత్రులపై సంతకాలు, వద్దన్న బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

C Ramachandraiah and Mahidhar Reddy
హైదరాబాద్: ఇద్దరు మంత్రులకు వ్యతిరేకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు పలువురు సంతకాలు సేకరిస్తున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి వర్గానికి చెందిన దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వర్గంగా ముద్రపడిన మంత్రి మహీధర్ రెడ్డికి వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు గురువారం సంతకాలు సేకరిస్తున్నారు. ఈ సేకరణ శుక్రవారం కొనసాగే అవకాశముంది.

సి.రామచంద్రయ్య, మహీధర్ రెడ్డిలను మంత్రివర్గం నుండి తప్పించాలని, వారి పని తీరు అసంతృప్తిగా ఉందని సంతకాలు సేకరిస్తున్నారు. వీటిని వారు ముఖ్యమంత్రికి, పార్టీ అధిష్టానానికి ఇవ్వనున్నారు. మంత్రులుగా ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యేలను వారు పట్టించుకోవడం లేదని, పనులు చేయడం లేదని వారు అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల సంతకాల సేకరణ లాబీల్లో చర్చకు వచ్చింది.

ఎమ్మెల్యేలు కెఎల్ఆర్, వీరశివా రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, రౌతు సూర్యప్రకాశ రావు తదితరులు సంతకాల సేకరణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యతిరేకంగా సంతకాలు చేయిస్తున్న వారిలో చిరు వర్గం మంత్రి, కిరణ్ వర్గం మంత్రి ఉండటం గమనార్హం. మరోవైపు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వారిని వారిస్తున్నారట.

ఎమ్మెల్యేలు సంతకాలు సేకరించి ముఖ్యమంత్రికి, అధిష్టానానికి ఇస్తే వారేం చేస్తారనే చర్చ కూడా సాగుతోంది. వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారిలో చిరు, కిరణ్ వర్గం వారు ఉన్నారు. వీరి సంతకాలతో వారిని తొలగించనప్పటికీ ప్రభావం మాత్రం ఉంటుందని అంటున్నారు.

English summary
Congress Party MLAs are collecting signs againt Ministers C Ramachandraiah and Mahidhar Reddy on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X