కోర్టుకు సబిత, అంబులెన్స్లో శ్రీలక్ష్మి: శంకరన్నపై కేసు
ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కూడా కోర్టుకు వచ్చారు. ఆమె అంబులెన్సులో కోర్టు వద్దకు వచ్చారు. అనారోగ్యం కారణంగా తాను కోర్టు మెట్లు ఎక్కలేనని, కింద అంబులెన్సులో ఉన్నట్లు శ్రీలక్ష్మి కోర్టుకు తెలిపింది. మరోవైపు సబితా సమర్పించిన రెండు పూచీకత్తులను సిబిఐ ఆమోదించింది. అయితే పూచీకత్తులు ఆమోదించినంత మాత్రాన స్వేచ్ఛ కల్పించినట్లు కాదని కోర్టు తెలిపింది.
మోపిదేవి బెయిల్ పిటిషన్ వాయిదా
జగన్ ఆస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్ పైన తీర్పును ఈ నెల 28వ తేదికి వాయిదా వేసింది.
నా ప్రమేయం లేదు: కన్నా
రాంకీ కేటాయింపుల వ్యవహారంలో తన ప్రమేయం ఏమాత్రం లేదని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ వేరుగా అన్నారు. సిబిఐ ఛార్జీషీటు అదే తెలియజేస్తోందన్నారు.
శంకర రావుపై మరో కేసు
మాజీ మంత్రి శంకర రావుపై శుక్రవారం మరో కేసు నమోదయింది. ఈ ఏడాది మే 1వ తేదిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పోలీసు శాఖపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఓ వ్యక్తి హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన కోర్టు శంకర రావుపై కేసును నమోదు చేయాలని సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది. దీంతో 500, 506తో పాటు పోలీసు సెక్యూరిటీ యాక్ట్ కింద కేసును నమోదు చేశారు. ఇప్పటికే శంకర రావు తన వంశీప్రియ కేసును ఎదుర్కొంటున్నారు.