వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యను వంద ముక్కలు చేసిన మాజీ ఆర్మీ అధికారి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nurder
భువనేశ్వర్: ఒడిషా రాష్ట్రంలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. తన భార్యను ఓ మాజీ సైనికాధికారి వందకు పైగా ముక్కలు చేసిన చంపాడు. ఆమె శరీరభాగాలను విడతలవారీగా తరలిస్తూ వచ్చాడు. ఈ కిరాతకమైన హత్య 15 రోజుల క్రితం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఈ హత్య సమాచారం బయటకు వచ్చింది.

నిందితుడు సోమనాథ్ పరిదాను పోలీసులు నయాపల్లిలోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. కచ్చితంగా భార్యను అతను ఎప్పుడు చంపాడు, హత్యకు గల కారణాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భార్యను చంపినట్లు పరిదా అంగీకరించాడని పోలీసులు చెప్పారు

హతురాలి శరీర భాగాలను కొన్నింటిని అతని నివాసంలోని బాక్స్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరిదా బంధువులు కొంత మంది శుక్రవారం సాయంత్రం ఆయన ఇంటికి రావడంతో సంఘటన వెలుగు చూసింది. అమెరికాలో ఉంటున్న సోమనాథ్, భార్య ఉషాశ్రీ కుమారుడు అమెరికా నుంచి పదే పదే ఫోన్లు చేస్తుండడంతో వారు ఇంటికి వచ్చారు. తమ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో కనుక్కుని చెప్పాలని వారి కుమారుడు బంధువులకు చెప్పాడు.

బంధువులు రావడంతో కంగు తిన్న పరిదా ఉషాశ్రీ బయటకు వెళ్లిందని చెప్పాడు. ఇంట్లో వస్తున్న దుర్వాసన వస్తుందని బంధువు ఒకతను ఫిర్యాదు చేశాడని, దాంతో బాక్స్‌లో పెట్టిన ఉషాశ్రీ శరీర భాగాలు కనిపించాయని పోలీసులు చెప్పారు.

English summary
A retired army officer allegedly chopped his wife's body to more than 100 pieces and stealthily disposed the body parts over several days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X