మాజీ ఘాతుకం: భార్యని చంపి, ముక్కలు చేసి దాచి...
ఒడిశాలోని భువనేశ్వర్లో శనివారం ఇది వెలుగు చూసింది. భువనేశ్వర్లోని సిఆర్పీఎఫ్ ప్రాంతంలో ఆర్మీ విశ్రాంత వైద్యుడు సోమనాథ్ పరిడా తన భార్య ఉషాశ్రీ పరిడాతో కలిసి నివసిస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి తమ తల్లి ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో విదేశాలలో ఉన్న కొడుకు, కుమార్తెలు ఆందోళనకు గురయ్యారు.
కటక్లోని మావయ్యకి విషయం చెప్పారు. ఆయన భువనేశ్వర్లోని తన తమ్ముడిని సోమనాథ్ ఇంటికి వెళ్లి చూసి రమ్మన్నాడు. ఆయన శుక్రవారం సోమనాథ్ ఇంటికి వెళ్లగా తలుపులు మూసి ఉన్నాయి. కిటికీలో నుంచి చూడగా దుర్గంధం వెలువడింది. ఈ సమాచారం తెలుసుకున్న మావయ్య కటక్ నుంచి వచ్చి నయాపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు వెళ్లి తలుపులు తెరిచి చూడగా సోమనాథ్ ఇంట్లో ఒంటరిగా కూర్చొని కనిపించాడు. ఒంటినిండా రక్తం మరకలున్నాయి. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. కుటుంబ కలహాలతో తన భార్య తలను గోడకు బాదుకొని ఆత్మహత్య చేసుకుందని, ఈ విషయం బయటపడితే కేసు అవుతుందని శరీరాన్ని వందల ముక్కలు చేశానని సోమనాథ్ చెప్పాడు.