టిడిపి ఎమ్మెల్యేలకు వారెంట్, కెసిఆర్పై పిటిషన్ కొట్టివేత
విజయశాంతి, కెటిఆర్ ఆస్తులపై పిటిషన్ తిరస్కరణ
తెలంగాణ రాష్ట్ర సమితి సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి, సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు ఆస్తులపై దాఖలైన పిటిషన్ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం తిరస్కరించింది. దర్యాఫ్తు సంస్థలకే ఫిర్యాదు చేయాలని పిటిషనర్కు న్యాయస్థానం సూచించింది.
బిసి రిజర్వేషన్ల విచారణ వాయిదా
పంచాయతీ ఎన్నికలలో బిసిల రిజర్వేషన్ అంశంపై దాఖలైన పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ విచారణ రెండు వారాలు వాయిదా వేసింది.
జగన్ కేసులో కోర్టుకు సబిత
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సోమవారం మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, కోనేరు ప్రసాద్, రాజగోపాల్, శ్యామ్యూల్, బిపి ఆచార్య తదితరులు కోర్టుకు హాజరయ్యారు. ధర్మాన, సబితల కస్టడీ మెమో పైన విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. జగన్, ఓఎంసి, ఎమ్మార్ కేసుల నిందితుల రిమాండును ఈ నెల 15వ తేది వరకు పొడిగించింది. మరోవైపు బ్రాహ్మణీ స్టీల్స్ భూముల స్వాధీనంపై యథాస్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.