పెసరట్లు తిన్లేదు: కెటిఆర్కు యాష్కీ, చెప్పులతో నిరసన
కొంతమంది తాము బిర్యానీలు తినేందుకు మీటింగ్ పెట్టారని విమర్శలు చేస్తున్నారని, తామేం బిర్యానీలు తినడానికి సమావేశాలు పెట్టలేదని, బిర్యానీలు తినటం తెలంగాణ సంస్కృతిలో భాగమని, తామేమీ ఆంధ్రావాళ్ల పెసరట్లు తినడం లేదని కెటిఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
చెప్పులు చూపిస్తూ నిరసన
తెలంగాణ కాంగ్రెసు నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభలో కొందరు యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, చెప్పులు చూపిస్తూ హడావుడి చేశారు. నేతలకు అనుకూలంగా కొందరు జై కొడుతుంటే, కాంగ్రెసు వల్లనే మోసపోయామంటూ మరికొందరు నినదించారు.
పరిస్థితి చేయిదాటిపోకుండా పోలీసులు వారిని పక్కకు తప్పించారు. తెలంగాణకు అనుకూలంగా వారు నినాదాలు చేశారు. కొందరు తెలంగాణ ద్రోహి కాంగ్రెస్ అని రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శిస్తే, మరికొందరు నెహ్రూ నుండి సోనియా వరకు కాంగ్రెసు నేతలంతా తమని మభ్యపెడుతున్నారని ప్రదర్శించారు.
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతున్న సమయంలో ఓ యువకుడు చెప్పును చూపిస్తూ దూషించారు. మంత్రి జానా రెడ్డి మాట్లాడుతున్నప్పుడు జానా రెడ్డి ఖబర్దార్ అంటూ మరో యువకుడు చెప్పు చూపించాడు.