హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెసరట్లు తిన్లేదు: కెటిఆర్‌కు యాష్కీ, చెప్పులతో నిరసన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Madhu Yashki - KT Ramarao
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల తెలంగాణ సాధన సభ కేవలం బిర్యానీలు తినేందుకేనన్న తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలకు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ సభా వేదికపై మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు.

కొంతమంది తాము బిర్యానీలు తినేందుకు మీటింగ్ పెట్టారని విమర్శలు చేస్తున్నారని, తామేం బిర్యానీలు తినడానికి సమావేశాలు పెట్టలేదని, బిర్యానీలు తినటం తెలంగాణ సంస్కృతిలో భాగమని, తామేమీ ఆంధ్రావాళ్ల పెసరట్లు తినడం లేదని కెటిఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

చెప్పులు చూపిస్తూ నిరసన

తెలంగాణ కాంగ్రెసు నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభలో కొందరు యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, చెప్పులు చూపిస్తూ హడావుడి చేశారు. నేతలకు అనుకూలంగా కొందరు జై కొడుతుంటే, కాంగ్రెసు వల్లనే మోసపోయామంటూ మరికొందరు నినదించారు.

పరిస్థితి చేయిదాటిపోకుండా పోలీసులు వారిని పక్కకు తప్పించారు. తెలంగాణకు అనుకూలంగా వారు నినాదాలు చేశారు. కొందరు తెలంగాణ ద్రోహి కాంగ్రెస్ అని రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శిస్తే, మరికొందరు నెహ్రూ నుండి సోనియా వరకు కాంగ్రెసు నేతలంతా తమని మభ్యపెడుతున్నారని ప్రదర్శించారు.

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతున్న సమయంలో ఓ యువకుడు చెప్పును చూపిస్తూ దూషించారు. మంత్రి జానా రెడ్డి మాట్లాడుతున్నప్పుడు జానా రెడ్డి ఖబర్దార్ అంటూ మరో యువకుడు చెప్పు చూపించాడు.

English summary
Nizamabad MP Madhu Yashki on Sunday blamed TRS MLA KT Ramarao for his comments on 'biryani'. Yashki said that Congress leaders are not eating Pesarattu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X