జగన్ రిమాండ్ పొడగింపు: కోర్టుకు సబిత, ధర్మాన
అలాగే వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితులు మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, కేవి బ్రహ్మానందరెడ్డి, విజయసాయి రెడ్డిలకు కూడా న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఒఎంసి కేసులో నిందితులు గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిల రిమాండ్ను కూడా జూలై 15 వరకు పొడిగించింది.
జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద రావు సోమవారం ఉదయం నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. వివిధ కేసుల్లో మరికొందరు నిందితులు రాజగోపాల్, శామ్యూల్, కోనేరు ప్రసాద్, బీపీ ఆచార్య కూడా కోర్టుకు హాజరయ్యారు.
మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి కస్టడీ పిటిషన్పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. వారిని కస్టడీకి పంపాలని సిబిఐ వేసిన పిటిషన్పై సోమవారం నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరిగిన అనంతరం ఈ మేరకు వాయిదా పడింది.