వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్‌లో శశి థరూర్ 'టాప్' లేపిన నరేంద్ర మోడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shashi Tharoor - Narendra Modi
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ ట్విట్టర్‌ ఫాలోవర్స్‌లో మొదటి స్థానంలో నిలిచారు! మన దేశంలోని రాజకీయ నాయకుల్లో ట్విట్టర్‌లో అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న నేత మోడి నిలిచాడు. గతంలో ఈ టాప్ స్థానంలో కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత శశి థరూర్ ఉన్నారు.

ఇటీవలే థరూర్ టాప్‌ను మోడీ లేపేశారు! ట్విట్టర్‌లో మోడీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 18,26,055 ఉండగా, శశి థరూర్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 18,21,776గా ఉంది.

బిజెపి సీనియర్ నేత, లోకసభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ 5,23,336 మంది ఫాలోవర్స్, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ 54,968 మంది ఫాలోవర్స్, అమ్ అద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మంది 4,12,289 ఫాలోవర్స్ ఉన్నారు.

సాంకేతికతను ఎప్పటికప్పుడు వినియోగించుకోవడంలో నరేంద్ర మోడి ముందున్నారు. సామాజిక వెబ్ సైట్లను రాజకీయ నాయకులు ఎన్నికలకు తమ ప్రధాన ప్రచారాస్త్రంగా భావిస్తున్నారని ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ వరదల సమయంలో కాంగ్రెసు, బిజెపిలు ట్విట్టర్ బాటిల్‌కు దిగిన విషయం తెలిసిందే.

English summary
In yet another feather on Gujarat Chief Minister Narendra Modi’s cap, the Bharatiya Janata Party (BJP) stalwart has now become the most followed Indian politician on social networking website Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X