ప్రతిఇంట్లో భారతం: లక్ష్మీ నారాయణ, అశ్లీల సాంగ్స్ పైనా
ఈ సందర్భంగా మాట్లాడారు. ఇంట్లో అమ్మ చెప్పే నీతి పాఠాలే పిల్లను భావి భారత పౌరుగులాగా తీర్చిదిద్దుతాయన్నారు. ప్రతి ఇంట్లో సినిమా డివిడిలకు బదులు రామాయణం, మహాభారతం, వేమన, సుమతి శతక గ్రంథాలు ఉండే బావుంటుందన్నారు. వేమన, సుమతి శతకాలు పిల్లలకు నేర్పిస్తే వారిలో నైతికత పెరుగుతుందని చెప్పారు.
అశ్లీల పాటలు రాసే రచయిత, తప్పుడు సందేశాలు ఇచ్చే దర్శకులు తన దృష్టిలో అవినీతిపరులేనని లక్ష్మీనారాయణ అన్నారు. పిల్లలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. స్వచ్చంధ సంస్థలన్నీ ఒకే తాటి పైకి వచ్చి పని చేసినప్పుడు సమాజానికి నిజమైన సేవ అందుతుందన్నారు.
కాగా లక్ష్మీనారాయణ గత నెల పదకొండవ తేది వరకు హైదరాబాదు సిబిఐ జెడిగా విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఆయన ఏడేళ్ల పాటు రాష్ట్రంలో ఉన్నారు. కర్నాటక మాజీ గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసు, జగన్ ఆస్తుల కేసు తదితర కేసులను ఆయన దర్యాఫ్తు చేశారు.