హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పు: స్నేహితురాలిపై దాడి, ఎమ్మెల్యే భార్యపై ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాజధానిలోని ఎల్బీ నగర్ శాసన సభ్యుడు సుధీర్ రెడ్డి భార్య కమల తనను వేధిస్తున్నారంటూ ఓ బాధితురాలు సైదాబాద్ పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన అరుణ, కమల చిన్ననాటి స్నేహితులు. అరుణ తన భర్త ఆంజనేయులుతో కలిసి సైదాబాదులో ఉంటున్నారు. రెండేళ్ల క్రితం కమల వద్ద రూ.2 కోట్లు అప్పు తీసుకున్నారు. ఇటీవల వడ్డీతో సహా రూ.4.50 కోట్లు చెల్లించామని బాధితులు చెబుతున్నారు.

ఇంకా రూ.1.80 కోట్లు ఇవ్వాల్సి ఉందంటూ సుధీర్ రెడ్డి మేనల్లుడుని వెంటబెట్టుకొని కమల ఆదివారం రాత్రి అరుణ ఇంటికి వచ్చి గొడవ చేశారు. ఈ క్రమంలో అరుణ తలకు గాయమైంది. దీంతో మిగిలిన డబ్బులు ఇవ్వకుంటే తనను చంపుతానని బెదిరించారని, తన కుటుంబానికి కమల నుండి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలంటూ అరుణ ఆదివారం సైదాబాద్ పోలీసులను ఆశ్రయించారు.

ఆస్మాన్‌ఘడ్ త్రివేణి నగర్‌లో ఉండే ఎల్ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఆంజనేయులు, భార్య అరుణ ఉంటున్నారు. కమల నుంచి రూ.2 కోట్లు అప్పు తీసుకున్న అరుణ.. ఆ డబ్బును అధిక వడ్డీకి అబిడ్స్‌లోని ఓ జువెలర్స్ యజమానికి ఇచ్చారు. సదరు జువెలర్స్ యజమాని వ్యాపారంలో నష్టం వచ్చి దివాళా తీశాడు. ఇటీవల ఐపి పెట్టాడు.

ఈ నేపథ్యంలో అప్పు మొత్తం తీర్చానని అరుణ చెప్పగా.. ఇంకా చెల్లించాల్సి ఉందని కమల అరుణ ఇంటికి వచ్చి గొడవ పడ్డారు. తాను చెల్లించాల్సిది ఏమీ లేదని అరుణ చెప్పడంతో వారు ఆమెపై దాడి చేశారు. అరుణకు గాయమైంది. అరుణ నుంచి ఫిర్యాదు తీసుకున్నామని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సైదాబాద్ ఇన్‌స్పెక్టర్ ఎ.శ్రీనివాసులు తెలిపారు. కాగా, తన భార్యను పావుగా చేసి కొందరు రాజకీయ లబ్ధి పొందేందుకు నాటకాలాడుతున్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపించారు.

English summary
A complaint booked against Kamala on Sunday at Saidabad Police Station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X