బిల్డింగ్ పైనుండి దూకి మహిళా టెక్కీ ఆత్మహత్య
ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాల పేరుతో మోసం
హైదరాబాదులోని హిమయత్ నగర్లో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఓ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన నిర్వాహకులు ఒక్కో యువతి నుండి దాదాపు రెండు లక్షల రూపాయలు వసూలు చేశారు. ఎంతకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో బాధితులు సంస్థ కార్యాలయంపై దాడి చేసి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
యాసిడ్ దాడులు: కేంద్రంపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: యాసిడ్ దాడులను అరికట్టడంలో కేంద్రం వైఫల్యంపై సుప్రీం కోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. యాసిడ్ దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని, యాసిడ్ విక్రయాలపై నిబంధలను కఠినతరం చేసే అంశంపై కేంద్రం ఆలోచించాలని సూచించింది. కేంద్రం స్పందించకుంటే ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.
జి.కొండుకు ఘటనపై విచారణ ప్రారంభం
కృష్ణా జిల్లా జి.కొండూరులో పోలీసు అధికారుల వీరంగంపై అధికారులు విచారణ ప్రారంభించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై అబ్దుల్ హక్, సిఐ బంగార్రాజులను ఏఎస్పీ విచారించారు.