జగన్పార్టీ లీడర్స్ అరెస్ట్, ఎమ్మెల్యే కొడుకు కారు-ఆటో ఢీ
ఎమ్మెల్యే కుమారుడి కారు ఢీ
కర్నూలు జిల్లాలో ఓ ఎమ్మెల్యే కుమారుడి వాహనం ఢీకొని పలువురికి గాయాలయ్యాయి. జిల్లాలోని వెంకన్న బావి వద్ద ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడి కారు ప్రయాణీకులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.
పసికందు మాయం
చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రసూతి ఆస్పత్రిలో పసికందు అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. గత అర్ధరాత్రి 12 గంటలకు ఓ పసికందును గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లిన ట్లు తెలుస్తోంది. రేణిగుంట మండలం వడ్డెమిట్టకు చెందిన కమల శనివారం ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే పాప అనారోగ్యంతో ఉంది. ఈ సమయంలో సోమవారం ఆస్పత్రి వద్ద అనుమానాస్పదంగా తిరిగిన ఓ మహిళ శిశువును ఎత్తికెళ్లినట్లు అక్కడి సిబ్బంది చెబుతోంది.
రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసం
రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.కోటిన్నర మేర కుచ్చుటోపీ పెట్టిన సంఘటన హైదరాబాదులో వెలుగు చూసింది. ఈ ఘటనలో సిసిఎస్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.