వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొంగలే నేతలు: జగన్ పార్టీపై విహెచ్, షర్మిల యాత్ర పైనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు దోచుకొని, దాచుకొనే పార్టీ అని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు బుధవారం అన్నారు. దోచుకునే, జైలుకు వెళ్లే ఇలాంటి పార్టీలు మనకు అవసరమా అని రాష్ట్ర ప్రజలు ఓసారి ఆలోచించాలని ఆయన అన్నారు. ఆ పార్టీలో దొంగలే నేతలుగా ఉన్నారన్నారు. రాజమండ్రిలో ఏడున్నర కోట్ల కేసులో అరెస్టైన వ్యక్తి, విశాఖలో నకిలీ దొంగ నోట్ల కేసులో అరెస్టైన మహిళ.. ఇలా అందరూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన వారే అని విమర్సించారు.

ఇలాంటి నాయకులు, ఇలాంటి పార్టీలు అవసరమా అని ప్రజలు ఆలోచించాలన్నారు. జగన్ పార్టీని చూసి పిల్లలు కూడా చెడిపోతున్నారని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల పాదయాత్రకు ఎంత జనం వస్తున్నారో అంటూ ఎద్దేవా చేశారు. ఆమె పాదయాత్రలో గూండాలూ, రౌడీలే ఉన్నారని ఆరోపించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వచ్చే ఎన్నికలలో గెలుస్తుందని, అక్కడే భవిష్యత్తు ఉంటుందని కొందరు నాయకులు కలలు కంటున్నారని, ఆ పార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్నారని, జైళ్లకు వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చునన్నారు. ప్రజలతో ఛీ అనిపించుకోవాలనుకుంటే ఆ పార్టీలో చేరవచ్చునన్నారు.

ఆ పార్టీ గుణగణాలు బాగా లేవన్నారు. తాను గతంలోను జగన్ పార్టీ దొంగల పార్టీ అని చెప్పానన్నారు. ఇప్పుడు నిరూపితమవుతోందన్నారు. తాను ఏదైనా ఉంటే తప్ప అవాస్తవాలు చెప్పనన్నారు. జగన్ పార్టీలో దొంగలే నేతలుగా మారారనివిరుచుకుపడ్డారు.

English summary

 Congress Party senior leader and Rajya Sabha Member V Hanumantha Rao has lashed out at YSR Congress Party on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X