వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నా! తెలంగాణకు ఒప్పుకోండి: శైలజానాథ్‌తో పిడమర్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ravi appeals Sailajanath
న్యూఢిల్లీ/హైదరాబాద్: పక్కా సమైక్యవాది అయిన మంత్రి శైలజానాథ్, తెలంగాణవాది అయిన ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి నేత పిడమర్తి రవిలు గురువారం ఒకరికొకరు తారసపడ్డారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. ఎపి భవన్లో శైలజానాథ్, పిడమర్తి రవి, ఇతర ఓయు విద్యార్థులకు కనిపించారు.

శైలజానాథ్ వద్దకు వెళ్లిన పిడమర్తి రవి, ఆయన గెడ్డం పట్టుకొని అన్నా విభజనకు ఒప్పుకోండన్నా అని విజ్ఢప్తి చేశారు. దానికి మంత్రి స్పందిస్తూ.. తాను వ్యవహారాలను తారుమారు చేసే వ్యక్తిని కాదని, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండే వ్యక్తినన్నారు. అందరూ బాగుండాలనేది తన ఉద్దేశ్యమన్నారు.

తెలంగాణ ఇస్తే..: జిజెఎం

కేంద్రం తెలంగాణ ప్రకటిస్తే... గూర్ఖాల్యాండ్ కూడా ఇవ్వాల్సిందేనని గూర్ఖా జనముక్తి మోర్చా (జిజెఎం) డిమాండ్ చేసింది. "శుక్రవారం కోర్‌కమిటీ సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే... మాకూ రాష్ట్రం ఇవ్వాల్సిందే. లేనిపక్షంలో మళ్లీ వీధుల్లోకి వచ్చి పోరాడతాం'' అని జిజెఎం ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి గురువారం తెలిపారు.

జెఏసిని తప్పుపట్టిన టిఆర్ఎల్డీ

తెలంగాణ కోరుకుంటున్న శక్తులను ఒకే తాటి మీదకు తీసుకువచ్చి పోరాడాల్సిన తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ విమర్శించింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని, ప్రస్తుతం జరుగుతున్న తతంగం అంతా ఇందులో భాగమేనని టిఆర్ఎల్డీ గౌరవ అధ్యక్షురాలు ఇందిరా ఆరోపించారు.

English summary
Osmania University JAC leader Pidamarthi Ravi has appealed Minister Sailajanath over Telangana statehood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X