అన్నా! తెలంగాణకు ఒప్పుకోండి: శైలజానాథ్తో పిడమర్తి
శైలజానాథ్ వద్దకు వెళ్లిన పిడమర్తి రవి, ఆయన గెడ్డం పట్టుకొని అన్నా విభజనకు ఒప్పుకోండన్నా అని విజ్ఢప్తి చేశారు. దానికి మంత్రి స్పందిస్తూ.. తాను వ్యవహారాలను తారుమారు చేసే వ్యక్తిని కాదని, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండే వ్యక్తినన్నారు. అందరూ బాగుండాలనేది తన ఉద్దేశ్యమన్నారు.
తెలంగాణ ఇస్తే..: జిజెఎం
కేంద్రం తెలంగాణ ప్రకటిస్తే... గూర్ఖాల్యాండ్ కూడా ఇవ్వాల్సిందేనని గూర్ఖా జనముక్తి మోర్చా (జిజెఎం) డిమాండ్ చేసింది. "శుక్రవారం కోర్కమిటీ సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే... మాకూ రాష్ట్రం ఇవ్వాల్సిందే. లేనిపక్షంలో మళ్లీ వీధుల్లోకి వచ్చి పోరాడతాం'' అని జిజెఎం ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి గురువారం తెలిపారు.
జెఏసిని తప్పుపట్టిన టిఆర్ఎల్డీ
తెలంగాణ కోరుకుంటున్న శక్తులను ఒకే తాటి మీదకు తీసుకువచ్చి పోరాడాల్సిన తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ విమర్శించింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని, ప్రస్తుతం జరుగుతున్న తతంగం అంతా ఇందులో భాగమేనని టిఆర్ఎల్డీ గౌరవ అధ్యక్షురాలు ఇందిరా ఆరోపించారు.