విజయకాంత్ పైన హత్యాయత్నం కేసు, వేధిస్తున్నారని..
ఈ కేసు విచారణకు సంబంధించి గత 1న విజయ్కాంత్ నాగర్కోయిల్ కోర్టుకు హాజరైన నేపథ్యంలో అన్నాడిఎంకె న్యాయవాదులు, డిఎండికె న్యాయవాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వివాదం ముదిరి తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
ఈ వ్యవహారానికి సంబంధించి గురువారం కోట్టార్ పోలీసులు విజయ్కాంత్తో సహా నలుగురిపై 341 (విధుల నిర్వహణను అడ్డుకోవడం), 307( హత్యాయత్నం), 506(2) (హత్యా బెదిరింపు) , 352 (ప్రభుత్వ అధికారుల విధులకు భంగం వాటిల్లజేయడం) లాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అదే విధంగా డిఎండికె వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్నాడిఎంకె వర్గాలపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఇది ఇలా ఉండగా విజయకాంత్ పార్టీ నుంచి పాలక అన్నాడిఎంకెలోకి ఫిరాయించిన ఆరుగురు శాసన సభ్యులు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని కలిసి, విజయకాంత్ తమను వేధిస్తున్నాడనీ, రాజ్యసభ ఎన్నికల్లో తమ ఓటింగును ప్రశ్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు.