వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ రిమాండ్ 29 వరకు పొడిగింపు, కోర్టుకు మాజీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ys jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిల రిమాండును నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఈ నెల 29వ వరకు పొడిగించింది. ఈ రోజు జగన్ ఆస్తులు, ఎమ్మార్, ఓఎంసి కేసు నిందితులు కోర్టు ఎదుట హాజరయ్యారు.

జగన్, విజయ సాయి రెడ్డి తదితరులను కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించింది. విచారణ అనంతరం కోర్టు మూడు కేసుల నిందితులు జగన్, విజయ సాయి రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి, మోపిదేవి వెంకట రమణ, బ్రహ్మానంద రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరుల రిమాండును పొడిగించింది.

జగన్ కేసులో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వారు ఈ రోజు కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ నెల 29 వరకు ఈ కేసు నిందితులకు రిమాండును కోర్టు పొడిగించడంతో అప్పుడు సబితా, ధర్మానలు రావాల్సి ఉంటుంది.

కాగా అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డి గతేడాది మే 27వ తేదిన అరెస్టైన విషయం తెలిసిందే. అంతకుముందు ఇదే కేసులో విజయ సాయి రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ హాజరయ్యారు. సిబిఐ కేసును దర్యాఫ్తు చేస్తోంది. ఇప్పటికే పలు ఛార్జీషీట్లు దాఖలు చేసింది.

English summary
A special CBI court extended YSR Congress Party chief YS Jagamohan Reddy's judicial remand on Monday till July 29 along with others accused in connection with alleged quid pro quo deals in the assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X