జగన్ రిమాండ్ 29 వరకు పొడిగింపు, కోర్టుకు మాజీలు
జగన్, విజయ సాయి రెడ్డి తదితరులను కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించింది. విచారణ అనంతరం కోర్టు మూడు కేసుల నిందితులు జగన్, విజయ సాయి రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి, మోపిదేవి వెంకట రమణ, బ్రహ్మానంద రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరుల రిమాండును పొడిగించింది.
జగన్ కేసులో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వారు ఈ రోజు కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ నెల 29 వరకు ఈ కేసు నిందితులకు రిమాండును కోర్టు పొడిగించడంతో అప్పుడు సబితా, ధర్మానలు రావాల్సి ఉంటుంది.
కాగా అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డి గతేడాది మే 27వ తేదిన అరెస్టైన విషయం తెలిసిందే. అంతకుముందు ఇదే కేసులో విజయ సాయి రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ హాజరయ్యారు. సిబిఐ కేసును దర్యాఫ్తు చేస్తోంది. ఇప్పటికే పలు ఛార్జీషీట్లు దాఖలు చేసింది.