ఫొటోలు: మాటల్లోనే కాదు, తినడంలోనూ వెరైటీయే
న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీని గుర్తు పట్టనివారు దేశంలో ఉండరు. దలైలామా కూడా దేశంలో ఎనలేని ప్రజాదరణ ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్డీ ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో పేరెన్నిక గన్నారు. వారి మాటలు తూటాల్లా పేలుతుంటాయి.
పార్టీ సమావేశాల్లో, బహిరంగ సభల్లో వారి చిత్రాలను చాలా మంది చూసే ఉంటారు. వారి హావభావాలను గమనించే ఉంటారు. వారి వ్యక్తిగత జీవితాలు కూడా అంతే వెరైటీగా ఉంటాయి. దేన్నీ దాచుకోవడానికి ఇష్టపడనివారి లాగా కనిపిస్తారు.
తమ ఆగ్రహాన్ని, కోపాన్ని లోపల దాచుకునే తత్వం లాలూకు, మమతా బెనర్జీకి లేదు. ఎవరు ఏమనుకుంటున్నారనేది వారికి అవసరం లేదు. వారికి తోచింది మాట్లాడడం వారికే చెల్లుతుంది. లాలూ, మమతా బెనర్డీలతో పాటు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, పృథ్వీరాజ్ చవాన్ వంటివారి కొన్ని చిత్రాలను చూద్దాం.
రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మకర సంక్రాంతి సందర్భంగా తినుబండారాలను ఆరగిస్తూ ఇలా కనిపించారు.
దీదీగా ప్రసిద్ధి పొందిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధ్యక్షురాలు మమతా బెనర్జీ పార్క్ సర్కస్ మైదాన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఇలా పానీయాన్ని సేవిస్తూ...
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా చాయ్ తాగే తీరే వేరుగా ఉంటుంది. కర్ణాటకలోని గురుపురలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు దలైలామా టీ సేవిస్తూ ఇలా...
ఆదివారంనాడు ఎర్నాకులంలో రక్షణ మంత్రి ఎకె ఆంటోనీతో కలిసి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఇలా...
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్, మంత్రులు, ప్రతిపక్ష నేతలతో కలిసి శానససభ వర్షాకాలం సమావేశాల సందర్భంగా సహ్యాద్రిలో ఇలా...
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలో విజయకాంత్, చో రామస్వామిలతో కలిసి ఇలా..