వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైలులో యువతిని వీడియో తీసిన ఇద్దరు జవాన్లు అరెస్ట్
ఆమె విదిష నుండి భోపాల్కు వెళ్లేందుకు శనివారం రాత్రి రైలు ఎక్కింది. ఎస్ 10 బోగీలో ఉన్న ఓ యువతిని అదే బోగీలో ఉన్న ఇద్దరు సిఆర్పీఎఫ్ జవాన్లు సెల్ ఫోనులో వీడియో తీశారు. అది గమనించిన ఆ యువతి వారిని అడ్డుకుంది. వారు వీడియో తీసిన సెల్ ఫోనును తీసుకునే ప్రయత్నం చేసింది.
వారు ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారిని ధర్మేంద్ర కుమార్, దినేష్ కుమార్లుగా గుర్తించారు. ఆ తర్వాత ఇద్దరు బెయిల్ పైన విడుదలయ్యారు. విచారణ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.
English summary
Two Central Reserve Police Force jawans were arrested in Bhopal for allegedly making a video-clip of a woman passenger in a train, police said on Sunday.
Story first published: Monday, July 15, 2013, 11:59 [IST]