కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళ గొంతుకోసి రైళ్లో నుండి తోసేశారు, విద్యార్థిని రేప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Woman
నెల్లూరు/కర్నూలు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని గూడూరు వద్ద ఓ రైళ్లో దుండగులు మహిళపై దాడి చేశారు. నడుస్తున్న రైలులోనే మహిళ గొంతుకు ఉరేసి... నగలు దోచుకొని నడుస్తున్న రైలు నుండి ఆమెను గెంటేశారు. తిరుపతి వైపు వెళ్తున్న హౌరా - యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో తూర్పు గోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందిన భవాని రైల్వే స్టేషన్‌లో ఎక్కింది.

బుధవారం అర్ధరాత్రి రైలు గూడురు స్టేషన్‌కు చేరుకోగా దుండగులు ఆమె మెడకు సన్నని తీగను చుట్టి ఉరిలా బిగించారు. ఆమె ఒంటి పైనున్న నగలు దోచుకున్నారు. గూడురు స్టేషన్ రైలు చేరుకోగానే ఆమెను కదులుతున్న సమయంలోనే ఒకటో నెంబరు ప్లాట్ ఫారం పైకి తోసేశారు. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

కర్నూలు జిల్లాలో దారుణం

కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో ఓ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఓ యువతి అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను గుర్తించిన పలువురు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. బాధిత యువతి ఇంజనీరింగ్ విద్యార్థినిగా అనుమానిస్తున్నారు. ఆమె సామూహిక అత్యాచారానికి గురై ఉంటారని అనుమానిస్తున్నారు. యువతిని కర్నాటకకు చెందిన కోలార్‍వాసిగా గుర్తించారు. తన సోదరిని నర్సింగ్ కళాశాలలో చేర్పించేందుకు వచ్చింది.

హోటల్లో అగ్ని ప్రమాదం

చిత్తూరు జిల్లా తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
A woman was throwned off train by unknown people in SPSR Nellore district on Wednesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X