పిఆర్పీ గతే జగన్కు, వైఎస్ బతికుంటే: మురళీ మోహన్
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే ఇప్పుడు చర్లపల్లి జైలులో ఉండేవారన్నారు. పంచాయతీ ఎన్నికలలో అధికార కాంగ్రెసు పార్టీ ప్రజలను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
విభజనపై తేల్చాలి
రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న విభజన సమస్యను తేల్చాలని మురళీ మోహన్ డిమాండ్ చేశారు. తెలంగాణ సమస్యను నాన్చడం సరికాదన్నారు.
తెలంగాణ అడ్డుకునేందుకే: గండ్ర
పంచాయతీ ఎన్నికలు ఏ పార్టీకి రెఫరెండం కాదని ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి వరంగల్లో అన్నారు. వచ్చే తెలంగాణను అడ్డుకునేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కేంద్ర హోంశాఖ మంత్రి షిండేకు లేఖ రాశారన్నారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మవి దొంగ దీక్షలు అన్నారు. వారం రోజుల్లో జరిగే సిడబ్ల్యూసి సమావేశంలో తెలంగాణపై నిర్ణయం ఉంటుందన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు నక్సలిజం పెరుగుదలకు సంబంధం లేదన్నారు.