Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అవనిగడ్డకు ఉప ఎన్నిక: ఏకగ్రీవానికి టిడిపి యత్నం

Krishna Map
హైదరాబాద్: కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల 21న ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూలు ప్రకటించింది. ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే నెల 3వ తేదీ చివరి గడువు.

వచ్చే నెల 5న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు 7వ తేదీ తుది గడువుగా సిఇసి ప్రకటించింది. వచ్చే నెల 21న పోలింగ్ కాగా 24న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

అయితే సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరంలోపు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే, ఆ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించబోమని గతంలో సిఇసి ప్రకటించింది.
బ్రాహ్మణయ్య మృతి చెందిన తేదీకి ఎన్నికలు సంవత్సరానికి పైగా ఉండడం వల్ల ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

కొంత మంది శాసనసభ్యులు రాజీనామా చేయడం వల్ల, కొంత మందిపై అనర్హత వేటు పడడం వల్ల రాష్ట్రంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కాగా, అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు హరిబాబును పోటీకి దించాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తోంది. ఆయన ఎన్నిక ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు చేయాలని అనుకుంటోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+