వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పంచాయతీ': భార్యా కొడుకు మృతి, ఆస్పత్రిలో అతను

By Pratap
|
Google Oneindia TeluguNews

ananthapuram
అనంతపురం: పంచాయతీ ఎన్నికలు భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టింది. దీంతో రెండు ప్రాణాలు ఉచితార్థంగా గాలిలో కలిసిపోయాయి. అనంతపురం జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తగాదా చోటు చేసుకుంది.

అనంతపురం జిల్లా గోరంట్ల మండలం గంగపల్లికి చెందిన లోకబాంధవరెడ్డి స్థానిక ఎన్నికలపై భార్య అరుణమ్మతో గొడవ పడ్డాడు. అది ముదిరి ఘర్షణకు దారి తీసింది. మద్యం మత్తులో ఉన్న లోకబాంధవ రెడ్డి భార్యపై కత్తితో దాడి చేశాడు.

నాలుగో తరగతి చదువుతున్న కుమారుడు నాగార్జున రెడ్డి అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో కోపోద్రిక్తుడైన లోకబాంధవరెడ్డి ఉచితానుచితాలు మరిచచి కొడుకపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నాగార్జున రెడ్డి అక్కడికక్కడే మరణించాడు.

కుమారుడి మరణంతో మనస్తాపానికి గురైన భార్యాభర్తలు శరీరాలపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ సంఘటనలో అరుణమ్మ మరణించగా, లోకబాంధవరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

English summary
A clash between husband and wife on Panchayat elections took to lives in Ananthapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X