వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్ ఫ్రెండ్‌పై మరో ఇద్దరితో కలిసి గ్యాంగ్ రేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

Malestation
భువనేశ్వర్: ఫేస్‌బుక్ బుక్ ద్వారా పరిచయమై తనను కలుసుకున్న స్నేహితురాలిని ఓ వ్యక్తి రేప్ చేశాడు. అతనితో పాటు మరో ఇద్దరు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రైవేట్ విద్యా సంస్థ డైరెక్టర్ అయిన 28 ఏళ్ల ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. సామూహిక అత్యాచారం కేసులో తాము ప్రధా నిందితుడు జితేంద్ర బిస్వాల్‌ను అరెస్టు చేశామని, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని భువనేశ్వర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ నితిన్‌జిత్ సింగ్ శనివారంనాడు చెప్పారు.

పోలీసుల కథనం ప్రకారం - ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన 23 ఏళ్ల యువతి ఐదు నెలల క్రితం సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ద్వారా బిస్వాల్‌కు పరిచయమైంది. వారు తరుచుగా చాటింగ్ చేసుకుండేవారు. గురువారంనాడు బిస్వాల్ ఆ అమ్మాయిని తన వద్దకు ఆహ్వానించాడు. భువనేశ్వర్‌లోని ఓ మాల్‌లో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బిస్వాల్ తన నగరమంతా తిప్పాడని, మధ్యలో మిత్రుడిని కారులో ఎక్కించుకున్నాడని ఆ అమ్మాయి ఫిర్యాదు చేసింది. కారును వేరే వ్యక్తి నడుపుతున్నట్లు తెలిపింది.

ఫిర్యాదు ప్రకారం - బిస్వాల్, అతని మిత్రుడు అమ్మాయితో బలవంతంగా మద్యం తాగించారు. ఆ తర్వాత ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. సాయంత్రానికి నగరం శివారులోకి చేరుకున్నారు. కారును ఆపి బిస్వాల్, అతని మిత్రుడు, చాఫర్ ఆమెపై అత్యాచారానికి దిగారు.

ఆమె అరుపులు విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గస్టీ వ్యాన్ అక్కడికి చేరుకుంది. పోలీసులకు బిస్వాల్ మాత్రమే చిక్కాడు. మరో ఇద్దరు పారిపోయారు. బిస్వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
A 28-year-old director of a private educational institute was arrested for allegedly raping a woman with whom he had gone a date, after meeting her on Facebook. Two others, who also raped her, have absconded after the crime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X