గండ్ర కోడ్ ఉల్లంఘన: జగన్ పార్టీకి పాస్టర్ మద్దతు, కేసు
చర్చి ప్రాంగణంలోనే చీఫ్ విప్తో పాటు పార్టీ నాయకులు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు వేశారు. అదే వేదికగా గండ్ర ఇరవై నిమిషాల పాటు మాట్లాడారు. దళితుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ.. కాంగ్రెసు మద్దతుదారుకు ఓటేయాలని కోరారు. ప్రార్థనాలయాల్లో ప్రచారం నిర్వహించడం కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుందని మండల ఎన్నికల అధికారి తహసీల్దారు తెలిపారు.
పాస్టర్ పైన కేసు
ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా మాట్లాడిన ఓ పాస్టర్ పైన కేసు నమోదైంది. సదరు పాస్టర్ పంచాయతీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారులకు ఓటేయాలని అడిగారు. ఈ విషయమై జయమ్మ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రార్థన సమయంలో ఓ వర్గానికి చెందిన దాదాపు వంద మంది ప్రజలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారుకు ఓటేయాలని అడిగారని ఆమె ఫిర్యాదు చేశారు. మతపరంగా ఓట్లు అడగటం సరికాదని ఆమె పేర్కొన్నారు. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.