ప్రలోభాలకు లొంగొద్దు: ఓటు వేసిన మోహన్బాబు, విష్ణు
ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు వేయడం అందరి బాధ్యత, దానిని సద్వినియోగం చేసుకోవాలని మోహన్ బాబు ఈ సందర్భంగా అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వినియోగించుకోవడం అందరి హక్కు అని మంచు విష్ణు చెప్పారు.
కాగా తొలి దశ పోలింగ్ ఒంటి గంటకు ముగిసింది! అయితే ఒకటి గంట లోపు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు క్యూలో ఉన్న వారిని ఓటింగుకు అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. వర్షం కారణంగా అదిలాబాద్ జిల్లాలో ఏడు, విశాఖలో నాలుగు పంచాయతీలకు ఎన్నికలు వాయిదా పడినట్లు మిట్టల్ చెప్పారు.
వర్షం పడుతున్న ఓటర్లు భారీగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒంటిగంట లోపు క్యూలో నిలుచున్న వారిని అధికారులు అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.