వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌కు భయం: రోజా, బాబు పనైపోయింది: పాలడుగు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Roja
చిత్తూరు/హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పంచాయతీ ఎన్నికల భయం పట్టుకుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నేత రోజా గురువారం చిత్తూరు జిల్లాలో విమర్శించారు. కిరణ్ పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. తమ పార్టీ మద్దతుదారులపై వారు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఎవరు ఎన్ని కుట్రలకు పాల్పడినా తమ పార్టీ మద్దతుదారులే ఎక్కువ స్థానాలను సాధిస్తారన్నారు. కాంగ్రెసు పార్టీ దాడులను తెలుగుదేశం పార్టీ ఖండించక పోవడం శోచనీయమన్నారు. రెండు పార్టీలు కలిసి సహకార ఎన్నికల తరహాలోనే కుమ్మక్కు అయ్యాయని విమర్శించారు.

బాబుపై పాలడుగు ఫైర్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన కాంగ్రెసు పార్టీ శాసన మండలి సభ్యుడు పాలడుగు వెంకట్రావు మండిపడ్డారు. బాబుకు కాంగ్రెసును ఓడించే శక్తి లేదని, ఆయన తరం కాదని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వల్లనే తాము నష్టపోయామని అన్నారు.

చంద్రబాబుకు నైతికత, సిద్ధాంతాలు లేవన్నారు. ప్రాంతీయవాదంతో వచ్చిన టిడిపి ఉప ప్రాంతీయవాదానికి జవాబు చెప్పలేకపోయిందన్నారు. కొన్ని సర్పంచు పదవులు గెలువగానే భవిష్యత్తు తనదేనని బాబు భ్రమపడుతున్నారన్నారు. బాబు పని అయిపోయిందని, ఆ పార్టీ గెలువలేదన్నారు.

English summary
YSR Congress Party leader Roja on Thursday lashed out at CM Kiran Kumar Reddy and Congress MLC Paladugu Venkat Rao blamed TDP chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X