వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిగ్గుపడేలా చేసింది: కోల్‌‍కతా వేధింపులపై టివి యాంకర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 I am ashamed: TV anchor
కోల్‌కతా: తనకు కోల్‌కతా నగరం అంటే ఎంతో ఇష్టమని కానీ, సోమవారం రాత్రి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడం జీర్ణించుకోలేక పోతున్నానని హౌరా రైల్వే స్టేషన్ వద్ద వేధింపులకు గురైన ముంబై టీవి యాంకర్ పేర్కొంది. తాను గత కొన్నేళ్లుగా ముంబైలో ఉంటున్నానని అయినా కోల్‌కతా అంటే తనకు ఇష్టమని తెలిపింది.

కోల్‌కతా గురించి, ప్రజల గురించి తన స్నేహితులకు తాను గర్వంగా చెప్పేదానిని అని తెలిపింది. కానీ సోమవారం నాటి ఘటన కోల్‌కతా పట్ల తనకు ఉన్న అభిమానాన్ని సిగ్గుపడేలా చేసిందని పేర్కొంది. ఈ సంఘటనతో కోల్‌‌కతా తనను ఫెయిల్ చేసిందని తెలిపింది.

కాగా మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఈ టివి యాంకర్‌ను పశ్చిమ బెంగాల్‌లోని హౌరా రైల్వే స్టేషన్ సమీపంలో వేధించిన విషయం తెలిసిందే. నిందితులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ తర్వాత విడుదల చేశారు. ముంబైకి చెందిన టివి యాంకర్ తన తండ్రి, ఒక స్నేహితుడితో కలిసి కోల్‌కతా నగరాన్ని చూసేందుకు వచ్చారు.

ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ వద్ద రతన్ సాహు అనే వ్యక్తి ఆమెను వేధించాడు. వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం అతనిని బెయిల్ పైన విడుదల చేశారు.

తనపై దాడి చేసిన వ్యక్తిని ఎదుర్కోవడానికి ఆమె ప్రయత్నించారు. కారులో ఉన్న యాంకర్‌ను సాహు బయటకు లాగే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో నిందితుడు ఆమె తండ్రి పైన దాడికి పాల్పడ్డాడు. టివి యాంకర్‌ను వేధించడం, తండ్రి పైన దాడికి పాల్పడటం పలువురు చూస్తుండగానే జరిగింది.

English summary
'Monday night's incident has left me ashamed of my city. Kolkata has failed me.' said Mumbai based TV anchor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X