జగన్ పార్టీ నేత, మాజీ మంత్రి ఉప్పునూతల మృతి
మే 1న ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఉప్పునూతల కోమాలోనే ఉన్నారు. ఉప్పునూతల స్వగ్రామం నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం అడ్డగూడూరు. కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు మంత్రివర్గాల్లో పురుషోత్తం రెడ్డి మంత్రిగా పనిచేశారు. రామన్నపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఎమ్మెల్సీగా, తెలంగాణ అభివృద్ధి మండలి ఛైర్మన్గా, ఎపిఐఐసీకి చైర్మన్గా ఉప్పునూతల పనిచేశారు. ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి మృతి పట్ల పలువురు దిగ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్ నేతను కోల్పోయామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నల్లగొండ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి అన్నారు.
పురుషోత్తమ రెడ్డి సుదీర్ఘ కాలం కాంగ్రెసు పార్టీలో కొనసాగారు. ఇటీవల ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. 80 ఏళ్ల వయస్సు గల పురుషోత్తమరెడ్డికి సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. ఆయనకు కభార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.