మోత్కుపల్లి, యాష్కీ మధ్య ఆసక్తిక చర్చ, పితాని రిజైన్
ఇరువురు కలిసినప్పుడు మొదట మోత్కుపల్లి స్పందిస్తూ... తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో సంబంధం లేకుండా తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అన్నారు. అందుకు యాష్కీ... తమ ఆలోచన మొదటి నుండి అదేనని చెప్పారు. వచ్చిన తెలంగాణ వెనక్కుపోయే అవకాశం లేదని, పార్టీల్లో అలజడి తగ్గడానికి మన వంతు ప్రయత్నం చేద్దామని మోత్కుపల్లితో అన్నారు.
దీంతో మోత్కుపల్లి తలుపులు, కిటీకీల వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ సీమాంధ్ర నేతలు విభజనను వ్యతిరేకించడం లేదని, తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని చెప్పారు. సీమాంధ్ర టిడిపి నేతల రాజీనామాలను యాష్కీ గుర్తి చేయగా.... తమ నేతలు రాజీనామా చేస్తోంది విభజనను వ్యతిరేకిస్తూ కాదని, ఆ విషయాన్ని వారు స్పష్టంగా చెబుతున్నారని, తమ ప్రాంతానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. సీమాంధ్ర ప్రజల హక్కులను అడగడాన్ని ఎలా తప్పు పడతామన్నారు.
పితాని రాజీనామా
రాష్ట్ర విభజనకు నిరసనగా మంత్రి పితాని సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అందజేసినట్లు ఆయన చెప్పారు.