మా వాదనలు వినడానికి ద్విసభ్య కమిటీ: జెడి శీలం
సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన మంత్రులను కలుసుకున్నామని, రాష్ట్ర పరిస్థితులను తెలుసుకున్నామని జేడీ శీలం అన్నారు. హైదరాబాద్లో ఉన్న అన్ని వర్గాలవారి పరిస్థితి గురించి ఆలోచించామని, దీనిపై సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆదివారం ఓ నిర్ణయానికి వచ్చారని, వాటిని తాము అంగీకరించారమని జేడీ తెలిపారు. వారు తీసుకున్న అభిప్రాయాలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర మంత్రి చిదంబరం, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్లను కలిసి వివరిస్తామని చెప్పారు.
సమస్యకు పరిష్కారం రాజీనామాలు కాదని, రాజీనామాలు చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని, అందరూ రాజీనామాలు చేస్తే ఎవరు పనిచేస్తారని జేడీ శీలం అన్నారు. ఇక్కడ పని చేసే చూపించాలని ఆయన అన్నారు.
రాష్ట్ర సమస్యలపై అధ్యయనం చేయడానికి కేంద్రం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసిందని ఈ కమిటీలో కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఉన్నారని ఆయన తెలిపారు. హైదరాబాదులో అన్ని వర్గాల యోగక్షేమాలను ఎలా కాపాడాలనే విషయంపై కూడా తాము చర్చించామని ఆయన చెప్పారు.