వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌తో పోలుస్తావా: షర్మిలపై కల్వకుంట్ల కవిత ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kalwakuntla Kavitha and Sharmila
హైదరాబాద్: హైదరాబాద్‌ను పాకిస్తాన్‌తో పోల్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి సంస్థ సప్తమ వార్షికోత్సవ సభ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ తమకు దక్కడం లేదన్న అక్కసుతోనే షర్మిల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

హైదరాబాద్‌లో శాంతి భద్రతలు కేంద్రం చేతిలోనే ఉంటే, ఢిల్లీలో జరిగిన పరిస్థితుల్లో పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని కవిత ఆందోళన వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేస్తూ, రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రాన్ని తెలంగాణ జాగృతి సంస్థ డిమాండ్ చేశారు.

వారు కనిపించుట లేదు

సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్య మం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం ఎక్కడా కనపించడం లేదని వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ఆ ఇరువురు నేతలూ రాయలసీమ ప్రాంతానికి చెందిన వారైనా సమైక్యాంధ్ర కోసం తన వాణిని బలంగా వినిపిస్తే ఎక్కడ తన పదవి ఊడుతుందోనని ఒకరు, హైదరాబాద్‌లో తన ఆస్తులను రక్షించుకోవడానికి మరొకరు వౌనంగా ఉన్నారని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

English summary
Telangana Jagruthi president and Telangana Rastra Samithi president K Chandrasekhar Rao's daughter Kalwakuntla Kavitha has lashed out at YSR Congress president YS Jagan's sister YS Sharmila.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X