పాక్తో పోలుస్తావా: షర్మిలపై కల్వకుంట్ల కవిత ఫైర్
హైదరాబాద్లో శాంతి భద్రతలు కేంద్రం చేతిలోనే ఉంటే, ఢిల్లీలో జరిగిన పరిస్థితుల్లో పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని కవిత ఆందోళన వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేస్తూ, రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రాన్ని తెలంగాణ జాగృతి సంస్థ డిమాండ్ చేశారు.
వారు కనిపించుట లేదు
సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్య మం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం ఎక్కడా కనపించడం లేదని వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఆ ఇరువురు నేతలూ రాయలసీమ ప్రాంతానికి చెందిన వారైనా సమైక్యాంధ్ర కోసం తన వాణిని బలంగా వినిపిస్తే ఎక్కడ తన పదవి ఊడుతుందోనని ఒకరు, హైదరాబాద్లో తన ఆస్తులను రక్షించుకోవడానికి మరొకరు వౌనంగా ఉన్నారని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.