వారిద్దరెక్కడ?, కెసిఆర్కు బదులుగనే షర్మిల: శోభా
ఇరువురు నేతలూ రాయలసీమ ప్రాంతానికి చెందిన వారైనా సమైక్యాంధ్ర కోసం తన వాణిని బలంగా వినిపిస్తే ఎక్కడ తన పదవి ఊడుతుందోనని ఒకరు, హైదరాబాద్లో తన ఆస్తులను రక్షించుకోవడానికి మరొకరు మౌనంగా ఉన్నారని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పార్టీ నాయకురాలు షర్మిల హైదరాబాద్పై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు పలుమార్లు సీమాంధ్ర ప్రజలను అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు బదులుగా షర్మిల నగరంలోని సీమాంధ్రులకు భరోసా కల్పించేందుకు మాట్లాడారన్నారు.
సోనియాకు రఘువీరా రెడ్డి లేఖ
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచండని కోరుతూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి మంత్రి రఘువీరా రెడ్డి మంగళవారం ఒక లేఖ రాశారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన అనంతరం ఆగస్టు 3వ తేదీన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులందరూ సమావేశమైంది తెలిసిందే. ఈ సమావేశంలో రాష్ట్ర విభజనపై చర్చించి చేసిన తీర్మానాలను సోనియా గాంధీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.
అభ్యంతరాలు చెప్పండి
తెలంగాణపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పిన సీమాంెధ్ర నాయకులు ఇప్పుడు నిర్ణయం వెలువడిన తర్వాత రాద్దాంతం చేయడం సరికాదని టి కాంగ్రెసు నేతలు కెఆర్ ఆమోస్, యాదవ రెడ్డి తదితరులు అన్నారు.