వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎందుకు విడిపోవాలి..: ఇంటర్నెట్లో గజల్ పాట హల్‌చల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Songs on Telangana and Samaikyandhra movement
హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం ప్రముఖ గజల్ గాయకుడు, గిన్నిస్ రికార్డ్ హోల్డర్ గజల్ శ్రీనివాస్ ఓ పాట పాడారు. ఎందుకు విడిపోవాలి అంటూ పాట రూపంలో గళమెత్తారు. అది ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

తెలంగాణ, సమైక్య ఉద్యమాలలో ర్యాలీలు, రాస్తారోకోలు, బందులతో పాటు పాటల పాత్ర చాలా ఉంటుంది. తెలంగాణ ఉద్యమంపై, ఉద్యమం జరుగుతున్న కాలంలో ఎన్నో పాటలు వచ్చాయి. ఇటీవలి కాలంలో ప్రజా యుద్ద నౌక గద్దర్... పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... అనే పాట తెలంగాణ ప్రాంతంలో బాగా వినిపించింది. గత వారం రోజులుగా సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరందుకుంది.

ఈ నేపథ్యంలో కొందరు సమైక్యవాద గాయకులు తమ కలానికి పని చెబుతున్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని పాటలు అందుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ గజల్ గాయకుడు, గిన్నిస్ రికార్డ్ హోల్టర్ గజల్ శ్రీనివాస్ రాష్ట్ర సమైక్యంగా ఉండాలని కోరుకుంటూ ఓ పాట పాడారు.

ఎందుకు విడిపోవాలి... అంటూ సిరాశ్రీ రాసిన పాటను పాడారు. సిరాశ్రీ ఈ పాటను గంట వ్యవధిలో రాశారట. యూపిఏ, సిడబ్ల్యూసి విభజనకు అనుకూలంగా తీర్మానం చేశాక.. తమ ఎమోషన్స్‌ను ఈ పాట రూపంలో చెప్పామని గజల్ శ్రీనివాస్ చెబుతున్నారు. ఈ పాట తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదని లిరిసిస్ట్ సిరాశ్రీ చెప్పారు.

ఈ పాటలో తెలంగాణ ప్రాంత ప్రముఖులు కొమరమ్ భీమ్, రుద్రమ దేవి తదితరులను ప్రస్తావించామన్నారు. విభజనకు సరైన కారణం లేదని, అదే విషయాన్ని పాటలో ప్రస్తావించామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాటలు ప్రముఖ పాత్ర వహించాయని చెప్పవచ్చు. ఉద్యమ నేపథ్యంలో సినిమాలు కూడా వచ్చాయి.

English summary
After rallies, road blocks and bandhs, Telangana and Seemandhra activists have now taken to music to get their message across.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X