చిరును విలన్గా చూడొద్దు: సిఆర్, జగన్ పత్రికపై ఫైర్
ఇప్పుడు సీమాంధ్రలో ప్రజాందోళనను చూసి అక్కడ రాజకీయ లబ్ధి పొందేందుకు ఉద్యమం ముసుగులో ఆ రెండు పార్టీలు కుట్ర పన్నుతున్నాయన్నారు. విభజన నేపథ్యంలో చిరును విలన్గా చూపించడం సరికాదన్నారు. చిరంజీవి ఏనాడైనా తెలంగాణ కావాలని కోరారా అని, విభజన జరగాలని చెప్పారా అని, తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినని, అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాత్రమే పలుమార్లు చెప్పారన్నారు.
చిరంజీవిపై ఆ రెండు పార్టీలు వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సొంత మీడియా ద్వారా వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని, పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర విభజనపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం వల్ల ఆమెను చరిత్ర క్షమించమదని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. ప్రజల మనోభావాలను తెలుసుకోవాలంటూ ఆమె నిర్ణయం తీసుకున్నారన్నారు. రాయలసీమకు చెందిన ముఖ్యనేతలతో రాషట్ర్ానికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు.