స్వార్థంతోనే విభజన: అశోక్, బాబుపై మందకృష్ణ ఫైర్
తెలంగాణను మరోసారి అడ్డుకునేందుకు ప్రధాని మన్మోహన్సింగ్కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు కుమక్కై లేఖ రాశారని మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణలో భాగమని చెబితే దేశానికి రెండో రాజధాని అంటే ఒప్పుకుంటామన్నారు.
ఆంటోని కమిటీ కాంగ్రెస్ కమిటీ అని ఆయన అన్నారు. పార్టీ నేతల కమిటీలో సీమాంద్రుల అనుమానాలు తీర్చాలని ఆయన కోరారు. హైదరాబాద్లోని సీమాంధ్ర ప్రజల రక్షణ కోసం కాంగ్రెస్ ప్రత్యేక చట్టం తేవాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.
తెలంగాణపై చంద్రబాబు మళ్లీ రంగులు మార్చారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినోద్ ఆరోపించారు. ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖపై తెరాస మండిపడింది. తెలంగాణను అడ్డుకోవడమే చంద్రబాబు, సీఎం కిరణ్ పని అని విమర్శించారు. సమస్యలు చెప్పడం కాదు...పరిష్కారం చూపాలన్నారు. సీమాంధ్రలో రాజకీయ ఆదిపత్య పోరు సమ్మె జరుగుతోందని వినోద్ వ్యాఖ్యానించారు.