తెలంగాణలో సమైక్యవాణి, దీక్షబూనిన మంత్రి భార్య
ఇది శనివారం కృష్ణా జిల్లాకు చేరుకున్నప్పుడు ఎమ్మెల్యేలు దేవినేని ఉమామహేశ్వర రావు, తంగిరాల ప్రభాకర రావులు తెలంగాణ ప్రాంతంలోని సమైక్యవాదులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కరీంనగర్ జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పర్కాల సమ్మయ్య డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ స్వార్థం కోసం రాష్ట్ర విభజన జరగడం బాధాకరమని సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు పదవులు, అక్రమ ఆదాయం కోసం రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారని ఆరోపించారు. ఆయన స్వార్థానికి ఎంతోమంది విద్యార్థులు బలయ్యారని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు.
ఉద్యమంలో మంత్రి భార్య
సమైక్యాంధ్ర ఉద్యమంలో మంత్రి తోట నర్సింహం కుటుంబ సభ్యులు పాలుపంచుకుంటున్నారు. నిరసన కార్యక్రమాల్లో మంత్రి ఇప్పటికే బిజీగా ఉంటున్నారు. శనివారం ఆయన భార్య వాణి, కుమార్తె ప్రసన్నలు కూడా పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బానుగుడి చౌరస్తాలో తోట వాణి శనివారం ఉదయం నిరవధిక దీక్షకు కూర్చున్నారు.
విభజన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు దీక్ష కొనసాగుతుందని వాణి స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్ర ఐక్యత కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని మంత్రి తనయ తోట ప్రసన్న విలేకరులతో చెప్పారు. తన తల్లిదండ్రులే కోకా తాత కూడా ఉధ్యమంలో భాగస్వాములయ్యారని చెప్పారు.