మా గ్యాస్ తీసుకుంటూ టికి మద్దతా?: మోడీకి తోట
సీమాంధ్రులను రెచ్చగొట్టేలా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశఖర రావు, ఇతర తెలంగాణ ప్రాంత నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది వారి అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనమన్నారు.
రాజీనామా చేయను కానీ: బొత్స ఝాన్సీ
సమైక్యాంధ్రకు మద్దతుగా తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని విజయనగరం ఎంపి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మి తేల్చిచెప్పారు. శనివారం విజయనగరంలో ఎపిఎన్జీవో సంఘం జిల్లాశాఖ నేతలు ఆమెను కలిసి ఎంపి పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టారు. దీనిపై ఆమె స్పందించారు.
రాజీనామా చేయనని అయితే, సమైక్యాంధ్రకు మద్దతుగా పార్లమెంటులో తన వాణి వినిపిస్తానని చెప్పుకొచ్చారు. పార్లమెంటులో సమైక్య ప్లకార్డు పట్టుకోవడానికి నిరాకరించడాన్ని ఝాన్సీలక్ష్మి సమర్ధించుకున్నారు. ప్లకార్డులు పట్టుకునే సంస్కృతి తనది కాదని ఆమె వ్యాఖ్యానించారు.