'ముంబై చాలాదూరం.. గడ్చిరోలిని తెలంగాణలో కలపండి'
ఈ జిల్లాల నుంచి హైదరాబాదుకు వెళ్లేందుకు సుమారు నాలుగు గంటల సమయం మాత్రమే పడుతుందని, అదే ముంబైకి వెళ్లాలంటే మాత్రం ఎనిమిది గంటలకు పైగా పడుతుందని ఆయన చెబుతున్నారు. అంతేకాకుండా ఈ రెండు జిల్లాల్లో అత్యధికంగా తెలుగు మాట్లాడే వారు ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లాలను తెలంగాణ ఏర్పడ్డాక ఆ రాష్ట్రంలో కలపాలన్నారు.
ఆర్పీఐ చీఫ్ రామదాస్ అథవాలే విదర్బ ప్రత్యేక రాష్ట్రంపై రెఫరెండం పెట్టాలని రెండు రోజుల క్రితం డిమాండ్ చేశారు. రామదాస్ రెఫరెండమ్ డిమాండు తర్వాత రోజే ఎన్సీపి నేత ధర్మారావు విభజన చేయకుంటే గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాలను తెలంగాణలో కలపాలని కొత్త డిమాండ్ తెరపైకి తీసుకు రావడం గమనార్హం.
కాగా, ఆంధ్రప్రదేశ్ విభజనకు అడుగులు పడుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుండి కొత్త కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం పిఎంకె వ్యవస్థాపక అధ్యక్షురులు రామదాస్ మాట్లాడుతూ... తిరుపతి తమదేనని, దానిని తమిళనాడులో కలపాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.