బాసరలో దోపిడీ దొంగల బీభత్సం: ముగ్గురి హత్య
బాసరలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల శారదానగర్లో ఈ దారుణం జరిగింది. ఆలయం ఎదుట కొబ్బరి కాయల వ్యాపారం చేసే మణికంఠ ఇంటిపై దోపిడీ దొంగులు దాడి చేశారు. శనివారం తెల్లవారు జామును రెండు గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మణికంఠ కుటుంబం నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ కొబ్బరి కాయల వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. దోపిడీ దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మహిళ దారుణ హత్య
ఇదిలావుంటే, నెల్లూరు జిల్లా కావలిలో జెండా చెట్టు సెంటర్ వద్ద చిన కొండమ్మ (37) అనే మహిళ శనివారం ఉదయం దారుణ హత్యకు గురైంది. ఆస్తి వివాదం ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వివాదంలో ఉన్న ఆస్తికి సంబంధించి చినకొండమ్మకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినట్లు తెలుస్తోంది.
తీర్పు నేపథ్యంలో చిన కొండమ్మ కోడలు ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.