ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాసరలో దోపిడీ దొంగల బీభత్సం: ముగ్గురి హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Adilabad district
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా సరస్వతీ నిలయం బాసరలో దోపిడీ దొంగలు శనివారం తెల్లవారు జామును బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి యజమాని మణికంఠ, ఆయన భార్య సువర్ణలతో పాటు వారి కుమారుడు మరణించారు. మరో కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బాసరలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల శారదానగర్‌లో ఈ దారుణం జరిగింది. ఆలయం ఎదుట కొబ్బరి కాయల వ్యాపారం చేసే మణికంఠ ఇంటిపై దోపిడీ దొంగులు దాడి చేశారు. శనివారం తెల్లవారు జామును రెండు గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మణికంఠ కుటుంబం నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ కొబ్బరి కాయల వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. దోపిడీ దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మహిళ దారుణ హత్య

ఇదిలావుంటే, నెల్లూరు జిల్లా కావలిలో జెండా చెట్టు సెంటర్ వద్ద చిన కొండమ్మ (37) అనే మహిళ శనివారం ఉదయం దారుణ హత్యకు గురైంది. ఆస్తి వివాదం ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వివాదంలో ఉన్న ఆస్తికి సంబంధించి చినకొండమ్మకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినట్లు తెలుస్తోంది.

తీర్పు నేపథ్యంలో చిన కొండమ్మ కోడలు ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

English summary
Theives killed three persons at Basara of Adilabad district attacking a house. Police are searching for the accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X