వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగు నెలలుగా బంగళాలోనే షీలా రెడ్డి శవం

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లోని భారీ భవంతిలో ఓ 53 ఏళ్ల మహిళ శవం నాలుగు నెలలుగా పడి ఉంది. శవం దాదాపుగా కుళ్లిపోయి, ఎముకలు మాత్రమే మిగిలే స్థితికి వచ్చింది. బంధువులు ఎవరూ రాకపోవడంతో ఈ విషయాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఆమెను పోలీసులు షీలా రెడ్డిగా గుర్తించారు. ఈ మేరకు బుధవారం మీడియాలో వార్తలు వచ్చాయి.

ఆకలితో అలమటించి షీలా రెడ్డి నాలుగు, ఐదు నెలల క్రితం మరణించి ఉంటుదని పోలీసులు భావిస్తున్నారు. బెంగళూర్‌లోని ఇందిరానగర్ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. షీలా రెడ్డి ఒంటరిగానే ఉంటోందని, బంధువులు రాకపోవడంతో ఆమె తీవ్ర నిస్పృహకు గురై ఉంటుందని ఇరుగుపొరుగువారు అంటున్నారు.

House

ఆరు నెలల తర్వాత షీలా రెడ్డి సోదరుడు శంకర్ రెడ్డి ఇంటికి వచ్చాడు. కిటికీలోంచి చూసేసరికి అతనికి సోదరి శవం కనిపించింది. ఇంటిలో ఆహార పదార్థాలు ఏవీ కనిపించలేదని పోలీసులు చెప్పారు. కొద్ది నెలల క్రితం దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని ఇరుగుపొరుగువారు అంటున్నారు. కుక్క చచ్చిపోయి ఉంటుందని కొట్టిపారేశారని ఆరోపిస్తున్నారు.

షీలా రెడ్డి ఇంటికి ఎవరూ వచ్చేవారు కాదని, ఆమెకు ఆహారం ఇవ్వడానికి అప్పుడప్పుడు బంధువులు వచ్చేవారని చెబుతున్నారు. ఏళ్ల క్రితం ఆమె తల్లిదండ్రులకు ఇక్కడ భారీగా భూములుండేవని అంటున్నారు.

English summary
A 53-year-old woman lay dead in her sprawling bungalow in the heart of Bangalore for over four months, her body decomposed and half reduced to bones as not even close relatives visited her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X