వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధరల మంట: ఉల్లిగడ్డల ట్రక్కును ఎత్తుకెళ్లిన దొంగలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Onion
జైపూర్: దేశంలో ఉల్లిగడ్డలు బంగారంకన్నా ప్రియమైనట్లే కనిపిస్తున్నాయి. ఉల్లిగడ్డలను కూడా బీరువాలో పెట్టుకుని తాళం వేసుకుని పరిస్థితి వచ్చినట్లు కనిపిస్తోంది. అసాధారణంగా దోపిడీదొంగలు రాజస్థాన్‌లో ఉల్లిగడ్డల ట్రక్కును ఎత్తుకెళ్లారు. జైపూర్, ఢిల్లీ జాతీయ రహదారిపై షాపురా వాళ్లు ఉల్లిగడ్డలతో వెళ్తున్న వాహనాన్ని ఎత్తుకెళ్లారు. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

జైపూర్‌ రిటైల్ మార్కెట్లలో ఉల్లిగడ్డలు కిలో 65 నుంచి 75 రూపాయలు పలుకుతున్నాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి పది గంటల సమయంలో జరిగింది. శికర్‌లో మండీలో 40 టన్నుల ఉల్లిగడ్డలను నింపుకుని ట్రక్ డ్రైవర్ మింటూ, క్లీనర్ రింకూ మీరట్ వెళ్తుండగా దోపిడీ దొంగలు అడ్డగించి వాహనాన్ని ఎత్తుకెల్లారు.

షాపూర్ గ్రామం వద్ద టాటా 907 వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ట్రక్కు తమ వాహనాన్ని ఢీకొట్టిందని డ్రైవర్, క్లీనర్‌లతో వాదులాటకు దిగారు. వాహనం దిగాలని పట్టుబట్టారు. వారు దిగగానే వారిని పక్కకు నెట్టేసి వాహనాన్ని తోలుకెళ్లారు.

దాంతో డ్రైవర్, క్లీనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు గంటల పాటు గాలింపు జరిపి వాహనాన్ని దొంగిలించినవారిని పోలీసులు పట్టుకున్నారు. కోట్‌పుత్లీ వద్ద పోలీసులు ఆ వాహనాన్ని అడ్డగించారు. అయితే, వర్షం, చీకటి ఆసరా చేసుకుని వారు పారిపోయారు.

English summary
Three armed men stopped a truck carrying onion and decamped with the onion loaded vehicle at Shahpura village on Jaipur-Delhi highway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X