వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటి రమ్య గెలుపు: కుమారస్వామి భార్య అనిత ఓటమి

By Pratap
|
Google Oneindia TeluguNews

Anita Kumaraswamy and Ramya
బెంగళూర్: కర్ణాటకలోని రెండు లోకసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ విజయం సాధించింది. మాండ్యా, బెంగళూర్ రూరల్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. ఈ రెండు ఉప ఎన్నికలను కాంగ్రెసు, జెడి(ఎస్) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

మాండ్యాలో తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేశారు. బెంగళూర్ రూరల్ స్థానానికి 13 మంది పోటీ పడ్డారు. మాండ్యాలో నటి రమ్య మాజీ శాసనసభ్యుడు పుట్టురాజుపై విజయం సాధించారు. రమ్య మాండ్యాలో 47,662 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎంపిగా తాను కఠినంగా శ్రమిస్తానని, స్థానిక సమస్యలను లోకసభలో ప్రస్తావిస్తానని రమ్య చెప్పారు.

కాంగ్రెసు నాయకుడు డికె శివకుమార్ సోదరుడు డికె సురేష్ బెంగళూర్ రూరల్ సీటులో జెడిఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి భార్య అనితపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. కర్ణాటక శానససభకు ఎన్నిక కావడంతో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయడంతో ఆ సీట్లు ఖాళీ అయ్యాయి. దాంతో వాటికి ఉప ఎన్నికలు జరిగాయి.

తనకు విజయాన్ని చేకూర్చి పెట్టిన సోదరుడు శివకుమార్‌కు, పార్టీ సహచరులకు డికె సురేష్ కృతజ్ఝతలు తెలిపారు. ఆయన లక్షకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

English summary
Results for the Mandya and Bangalore Rural Lok Sabha seats were announced on Saturday. The by-polls were seen as a prestige battle between the ruling Congress and the JD(S) and the former came up with flying colours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X