మావోగా భావించి.. విద్యార్థి నేతను కొట్టి చంపిన వైనం
ముఖేష్ తన డ్రైవర్తో కలిసి ఉదయం దేవగఢ్కు కారులో వెళ్తున్నారు. ఈ సమయంలో గ్రామస్తులు వారి కారును నిలిపివేశారు. వారిని ప్రశ్నించారు. అంతలోనే గ్రామంలో మావోయిస్టుల కోసం గస్తీ తిరుగుతున్న గ్రామస్థులు వీరి కారును చూసి మావోయిస్టులుగా పొరబడ్డారని, వారి దాడి నుండి తప్పించుకునేందుకు పారిపోయే ప్రయత్నం చేయడంతో వారిని కొట్టి చంపారని పోలీసులు చెప్పారు.
గత కొంతకాలంగా గ్రామంలో భారీ దొంగతనాలు, లూటీలు, హత్యలు జరుగుతున్నాయి. వీటి వెనుక మావోయిస్టులు ఉన్నారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. దీంతో వారు గస్తీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖేష్ను, ఆయన డ్రైవర్ను గ్రామస్తులు ఆపివేశారు.
తాను మావోయిస్టును కాదని ముఖేష్ వారితో వాగ్వాదానికి దిగాడు. తాను ఎజెఎస్యు విద్యార్థి నేతనను అని తన కారుకు ఉన్న గుర్తును చూపించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ గ్రామస్తులు ఆయన వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో వారు అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. ఈ సమయంలో వారు పట్టుకొని చితకబాదారు. వారు చనిపోయారు.
మావోల మందుపాతర - బిఎస్ఎఫ్ జవాన్లు మృతి
ఒడిశాలో మావోయిస్టులు మళ్లీ చెలరేగిపోయారు. కోరావుట్ జిల్లా కొట్టంగిలో మావోలు పెట్టిన మందు పాతర పేలి నలుగురు బిఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు.