గ్యాంగ్ లీడర్ను చంపేందుకు జైల్లో జొరబడి పట్టుబడ్డారు
గురువారం ఉదయం నాలుగు, ఐదు గంటల సమయంలో పది జైలు యానాం సబ్ జైలులోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. జైలు వద్ద కాపలా ఉన్న సెంట్రీని తాళ్లతో బంధించి వారు తాము హత్య చేయాలనుకుంటున్న లీడర్ బ్యారక్ వైపుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు.
దీంతో వెంటనే అప్రమత్తమైన సెంట్రీలు గట్టిగా కేకలు వేశారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని నిందితులను వెంబడించారు. ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు పరారయ్యారు. వారు జైల్లో ఉన్న గ్యాంగ్ లీడర్ మర్డర్ మణికంఠన్ను హత్య చేసేందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మిగిలిన ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
టీకొట్లోకి దూసుకెళ్లిన లారీ
కడప జిల్లా బద్వేలులో ఈ తెల్లవారు జామున ఓ టీ దుకాణంలోకి లారీ దూసుకెళ్లింది. లారీ తమ వైపు వస్తున్న విషయాన్ని గుర్తించిన టీ దుకాణం యజమాని సహా ముగ్గురు తప్పించుకున్నారు. ఈ ఘటనలో దుకాణం పూర్తిగా ధ్వంసమైంది.