'... చంద్రబాంబు': నిలదీయాలని జగన్ పార్టీ, కాంగ్పై నో
రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి 40 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపడమేనని దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేయగా ఆనాడు సిఎల్పీ లీడర్గా ఆ ఎమ్మెల్యేల లేఖను వైయస్ పంపించింది నిజమేనని అంగీకరించారు. అయితే తనకు తానుగా వైయస్ ఎక్కడా తెలంగాణకు అనుకూలమని చెప్పలేదన్నారు. టిడిపి పలుసార్లు తెలంగాణకు అనుకూలమంటూ కేంద్రానికి లేఖలు ఇచ్చి, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు ఆత్మగౌరవయాత్ర అని చంద్రబాబు చెప్పడం దొంగే దొంగ అన్నట్లుందని ఎద్దేవా చేశారు.
ఆయన చేయాల్సింది ప్రజల కోసం ఆత్మగౌరవయాత్ర కాదని, కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకొని తన కోసం పశ్చాతాప యాత్ర చేయాలన్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి చంద్రబాబు గొడ్డలి(తెలంగాణకు అనుకూలంగా లేఖ) ఇచ్చారని 'సమైక్యంపై చంద్రబాంబు' అంటూ పోస్టర్ విడుదల చేశారు. కాగా, విభజనలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పాత్ర లేదా అని ప్రశ్నిస్తే వాటికి సమాధానం ఇవ్వలేదు.
సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పొత్తు పెట్టకోదని, ఎన్నికల అనంతరం ఎవరితో కలుస్తామో ఇప్పుడు చెప్పలేమని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. అయితే ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో కలిసిపోతారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా? అని విలేఖర్లు ప్రశ్నించగా అప్పుడు ఎవరితో కలుస్తామనేది ఇప్పుడెందుకు, అప్పుడే చెబుతాం అని సమాధానమిచ్చారు. కాగా, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు బస్సుయాత్ర ఎలా చేపడతారని ఆ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి వేరుగా ప్రశ్నించారు.