జగన్ పార్టీ ఎమ్మెల్యేను అడ్డుకున్న ఉపాధ్యాయులు
వైయస్ ఉంటే సమస్యలుండేవి కాదు: జోగయ్య
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉండి ఉంటే రాష్ట్రంలో సమస్యలు ఉండి ఉండేవి కాదని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఆదివారం ఏలూరులో అన్నారు. సమర్థత, పేదవారిని ఆదుకోవాలనే ఉద్దేశ్యాలే లక్ష్యంగా వైయస్ ఉండేవారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముందే రాజీనామా చేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదన్నారు.
ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఉభయ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాంగ్రెసు పార్టీ పూర్తిగా పక్కన పెట్టిందని విమర్శించారు. భవిష్యత్తులో కలిగే రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించి రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెసు నేతలు సిద్ధమైతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు.